నల్లగొండ : జిల్లా కేంద్రంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటిస్తున్నారు. నల్గొండలోని ఓ ప్రైవేట్ దవాఖాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ ఇక్కడికి వచ్చారు. దవాఖాన ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన సెమినార్ హాల్ ప్రారంభోత్సవం చేశారు.
ఆ తరువాత పానగల్లోని చారిత్రక ఛాయా సోమేశ్వరాలయం సందర్శించారు. అక్కడి ఆలయంలో శివ లింగం పై నీడ ( ఛాయ) పడే అద్భుతాన్ని స్వయంగా వీక్షించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు నాటారు. పర్యటనలో చివరగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఆ తరువాత యునివర్సిటీ ఛాన్సలర్ హోదాలో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహిస్తారు.
గవర్నర్ పర్యటన సందర్భంగా అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు గవర్నర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఇవి కూడా చదవండి..
Prabhas 25: అర్జున్ డైరెక్టర్తో ప్రభాస్ 25వ చిత్రం.. పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్