హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మంగళవారం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు నివాళులర్పిస్తున్నానన్నారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని విలువలు, హక్కుల రక్షణ కోసం పాటుపడాలన్నారు. వ్యాక్సినేషన్ను విజయవంతం చేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్లకు ఆమె సెల్యూట్ చేశారు.