హైదరాబాద్ : నగరంలోని రాజ్భవన్లో సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దంపతులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై పాలు పొంగించి, పొంగలి వండారు. రాష్ట్ర ప్రజలకు, రాజ్భవన్ సిబ్బందికి గవర్నర్ తమిళిసై సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.