అందుకే సచివాలయ ప్రారంభోత్సవానికి రాని గవర్నర్ తమిళిసై : మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట, మే 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రగతి నిరోధకులు తట్టుకోలేకపోతున్నారని, నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై రాకపోవడం అందులో భాగమేనని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన సూర్యాపేటలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి నిరోధకులు రానంత మాత్రాన జరిగే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. సచివాలయ ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడం గవర్నర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని, గైర్హాజరుతో వారి నిజస్వరూపం బట్టబయలైందని విమర్శించారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభం
మునుగోడు, మే1: నల్లగొండ జిల్లా మునుగోడు మం డల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యాన్ని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్యెల్యేను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.