హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం తెలిపారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం సాహసం ఎందరికో స్ఫూర్తి అన్నారు. స్వరాజ్యం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ దవాఖానలో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం పార్టీ కార్యాలయం ఎంబీ భవన్లో ఉంచారు. అటునుంచి నల్లగొండకు తరలించారు. మధ్యాహన్నం ఒంటి గంటకు పార్టీ కార్యాలయంలో నివాళి అర్పిస్తారు. అంతిమయాత్రి నిర్వహించిన తర్వాత 3.30 గంటలకు ఆమె పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు.