భద్రాచలం: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) రెండు రోజులపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరిన గవర్నర్ తమిళిసై కొత్తగూడెం చేరుకున్నారు. భద్రాచల క్షేత్రంలో కల్యాణ రామయ్యకు నేడు పట్టాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ సౌందరరాజన్ హాజరుకానున్నారు. అనంతరం గిరిజన మహిళల సీమంతం వేడుకలో పాల్గొంటారు. రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం పనితీరును సమీక్షిస్తారు. నాచారం జయలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తారు.
రేపు పూసకుంట, గోగులపూడి గిరిజనులను సమస్యలు తెలుసుకోనున్నారు. అదేవిధంగా మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ను సందర్శిస్తారు. కాగా, తమిళిసై గవర్నర్ హోదాలో తొలిసారిగా రైలులో ప్రయాణించారు.