హైదరాబాద్: సచివాలయ (Secretariat) ప్రాంగణంలోని నల్లపోచమ్మ ఆలయ ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నల్లపోచమ్మ ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.