రేపు రంగారెడ్డి జిల్లా కేసీతండాలో పర్యటన
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): గిరిజనులలో కొవిడ్ వ్యాక్సిన్పై నమ్మకం కలిగించి, ఎక్కువ మంది తీసుకునేలా ఆసక్తి పెంచడానికి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వారితో కలిసి వ్యాక్సిన్ వేసుకోనున్నారు. ఇందుకోసం సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీతండాకు వెళ్లనున్నారు.
బుధ, ఆదివారాలు వ్యాక్సినేషన్ బంద్
రాష్ట్రంలో శుక్రవారం 1.66 లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు వైద్యారోగ్యశాఖ శనివారం పేర్కొన్నది. ప్రభుత్వ కేంద్రాల్లో 1.38 లక్షల మంది, ప్రైవేటులో 28 వేల మంది టీకాలు వేసుకున్నారని తెలిపింది. టీకాలు తీసుకున్నవారి సంఖ్య 1.22 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. బుధ, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం బంద్ ఉంటుందని స్పష్టంచేసింది.