హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : రక్తదానంపై సమాజంలో చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న మేడ్చల్-మలాజిగిరి జిల్లా రెడ్క్రాస్ శాఖ చైర్మన్, మంత్రి జూపల్లి కృష్ణారావు ఓఎస్డీ డాక్టర్ ఎస్ఎం రాజేశ్వర్రావును గవర్నర్ శివప్రతాప్ శుక్లా పురస్కారంతో సత్కరించారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా లోక్భవన్లోని సంసృతి కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. డాక్టర్ రాజేశ్వర్ రావు ‘హయ్యెస్ట్ బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు-2026’ను గవర్నర్ చేతులమీదుగా స్వీకరించారు.