హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): మాదకద్రవ్యాల రహిత తెలంగాణగా నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా సూచించారు. యువతను మాదకద్రవ్యాల బారినపడకుండా విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛందసంస్థలు, పోలీసు శాఖ సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. (నషాముక్త్ భారత్) మాదవద్రవ్యాల నిర్మూలన, వృద్ధుల సంక్షేమం, ట్రాన్స్ జెండర్, దివ్యాంగుల సాధికారతపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బుధవారం లోక్భవన్ గవర్నర్తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను గవర్నర్కు వివరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడారు. సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ సాధికారత శాఖ సంచాలకురాలు బీ శైలజ తదితరులు పాల్గొన్నారు.