ములుగు : పాము కాటుకు గురై ములుగు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnudev Varma), మంత్రి దనసరి సీతక్కతో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. గవర్నర్ వెంట జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ షబరిష్, తదితరులు ఉన్నారు. కాగా, గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ములుగు (Mulugu district) జిల్లా పర్యటనలో అపశ్రతి చోటు చేసుకుంది.
గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘ టనలు చోటు చేసుకోకుండా గ్రేహౌండ్స్తో అధికారులు ముందస్తుగా భారీగా భద్రతా దళాలను మోహరిం చారు. వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అడవిలో విధుల్లో ఉన్న గ్రేహౌండ్ పోలీస్ కానిస్టేబుల్ (Constable) గుండ్ల ప్రశాంత్ అనే వ్యక్తికి పాము కాటు(Snake bite) వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటున కానిస్టేబుల్ను ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించి వైద్యమందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్కు తరలించారు.