హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : పోలీస్ వ్యవస్థ చట్టానికి, ప్రజల నమ్మకానికి వారధి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. శుక్రవారం రాజా బహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ(ఆర్బీవీఆర్ఆర్ టీజీపీఏ) 40వ ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన గడిచిన 40 ఏండ్ల ప్రయాణంలో అకాడమీ చూపిన క్రమశిక్షణ, దేశభక్తి, అంకితభావాన్ని కొనియాడారు. షీ టీమ్స్, సైబర్ నేరాల నియంత్రణ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, మహిళా రక్షణ చర్యలు తెలంగాణను దేశానికే రోల్ మోడల్గా నిలిపాయని పేరొన్నారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్త్ మాట్లాడుతూ 40 ఏండ్ల ప్రయాణం అనేది ఏ ఒకరి కాలపరిమితికో పరిమితమైనది కాదని, ఇదొక గొప్ప వారసత్వమని పేరొన్నారు.