మంచిర్యాల : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ పేపథ్యంలో చెన్నూరు బైపాస్ రోడ్ (అర్జునగుట్ట రోడ్డు) వద్ద గోదావరి నది ఉధృతిని ప్రభుత్వ విప్ , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
గోదావరికి అవతలి వైపు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్న గ్రామాలు అక్కేపల్లి, చింతలపల్లి, ఎర్రాయిపేట్, బోరంపల్లి, కొల్లూరు, రాంపూర్, దేవులవాడ, బబ్బెరు చెలుక, రాపన్ పల్లి, అర్జునగుట్ట, లక్ష్మీపూర్ గ్రామస్థులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఐదుగురుని బోట్ సహాయంతో చెన్నూరు పట్టణానికి తరలించారు.