హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా సర్కారీ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నదని పీఆర్టీయూ అధ్యక్షుడు ఎం చెన్నయ్య తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తున్నదని చెప్పారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యార్థులకు నోట్బుక్లను కూడా అందిస్తామని నిర్ణయించడం హర్షణీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.