హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలను ‘మన ఊరు-మన బడి’ కింద అభివృద్ధి చేసింది కేసీఆర్ సర్కారేనని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ స్పష్టంచేశారు. ఆరుట్ల స్కూల్లో బుధవారం బ్రేక్పాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తూ తానేదో పాఠశాలను అభివృద్ధి చేశామన్నట్టు సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేవలం గోడలకు సున్నాలు వేసి తన ఘనతగా చెప్పుకోవడం తగదని హితవుపలికారు.
ఆరుట్ల సూల్ తరహాలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను మారుస్తామని సీఎం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు ఫుల్ అయ్యాయని సీఎం అంటున్నారని, ఏ జిల్లాలో ఎన్ని బడుల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయో చెప్పాలని సవాల్ విసిరారు. బుధవారం తెలంగాణభవన్లో గెల్లు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ సూళ్లను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో గురుకులాల్లో అడ్మిషన్లకు బాగా డిమాండ్ ఉండేదని, ఇప్పుడు పిల్లలను గురుకులాలకు పంపాలంటేనే తల్లిదండ్రులు జంకుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తెస్తానని చెప్పిన రేవంత్రెడ్డి ఆ విషయంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని గెల్లు శ్రీనివాస్ ప్రశ్నించారు. వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం తేవాలనే డిమాండ్తో ఈ నెల 20న అన్ని మండలాల ఎంఈవోలకు వినతిపత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు. 22న అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణిలో ఫీజుల వసూళ్లపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. విద్యామంత్రిగా రేవంత్రెడ్డి ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు.