వరంగల్ : టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు, బాధ్యులు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ బాధ్యులు, యువ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, కార్మిక, రైతు సోషల్ మీడియా నాయకులతో సమావేశం నిర్వహించారు.
బూత్ కమిటీలను బలోపేతం చేయడంలో భాగంగా 150 మందికి ముగ్గురు ఇన్చార్జిలను నియమించాలని అందులో ఒకరు పార్టీ కార్యకర్త, మరొకరు మహిళ ఇంకొకరు యువత విభాగం నుంచి ఉండాలని వెల్లడించారు. డిసెంబర్ 5వ తేదీ నాటికి ఈ బూత్ కమిటీల బాధ్యులను నియమించాలన్నారు.ఈ సందర్భంగా మండలాల వారీగా బూత్ కమిటీ కోఆర్డినేటర్లను నియమించారు.బూత్ కమిటీలలో సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కమిటీని చేర్చ వద్దని పేరప్కొన్నారు.
సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలను కమిటీల్లో వేయాలన్నారు.ప్రతి గ్రామానికి, ఇంటింటికీ వ్యక్తిగతంగా అందిన ప్రభుత్వ పథకాల జాబితా గ్రామ బాధ్యుల వద్ద ఉండాలని, అవసరం అయితే కర పత్రాలు ముద్రించి, పంపిణీ చేయాలన్నారు.త్వరలో ఎంపీటీసీల పరిధిలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటామన్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్లు,రైతు బంధు, దళిత బంధు, పెన్షన్ల వంటి పెండింగ్ జాబితాలు రూపొందించి, అర్హులకు వచ్చే విధంగా సమన్వయం చేయాలన్నారు.