మహబూబ్ నగర్ : తెలంగాణ పల్లెలు ఆనందాల లోగిళ్లుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పల్లె సీమలు ఆర్థికంగా పురోగమిస్తున్నాయి.
గడపగడపకు ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో ప్రజల జీవన శైలిలో సమున్నతమైన మార్పులు వచ్చాయని, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బుధవారం ఆయన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మహబూబ్ నగర్ జిల్లా, అడ్డాకుల మండలం, కందూరు గ్రామ శివారు గ్రామమైన వడ్డేపల్లిలో కోటి 81 లక్షల 44 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన 36 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..గతంలో వడ్డేపల్లి గ్రామంలో వడ్డెరులు రాళ్లు కొట్టుకొని జీవనం సాగించే వారని, పడిపోయిన ఇళ్ళలో ఉంటూ కాలం వెళ్లదీసే వారన్నారు. అలాంటిది తమ ప్రభుత్వం 36 మంది కి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిందని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు, అన్ని కులాల వారు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని, ఇందులో భాగంగానే నిరుపేదల అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్నట్లు
తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవనశైలిలో ఎంతో మార్పు వచ్చిందని, ముఖ్యంగా పాలమూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, అందరి సహకారంతో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జడ్పిటిసి రాజశేఖర్ రెడ్డి, స్థానిక సర్పంచ్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.