జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. బుధవారం రాయికల్ పట్టణ, మండలాలకు చెందిన 45 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలు తమ పిల్లల వివాహానికి ఆర్థిక భారం కలుగకుండా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.
ఆరోగ్యరీత్యా మెరుగైన వైద్య సహాయం కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తున్నామని వివరించారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, దళిత బంధు తదితర పథకాలు పేదలకు ఎంతగానో సహాయపడుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం జగిత్యాల పట్టణం గాంధీ నగర్కు చెందిన మిత అయ్యాల్ గార్ సంక్షేమ సంఘ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సంక్షేమ సంఘానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.