హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా బడ్జెట్లో బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని బ్రాహ్మణ పరిషత్తు పాలనాధికారి రఘురామశర్మ పేర్కొన్నారు. తాజాగా 2023-24 బడ్జెట్లో ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించడం పట్ల పరిషత్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది.
బడ్జెట్తో ప్రాధాన్యం కల్పించడంపై సీఎం కేసీఆర్కు, పరిషత్ చైర్మన్ రమణాచారికి కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటివరకు బ్రాహ్మణుల సంక్షేమం కోసం వివిధ పథకాల కింద ప్రభుత్వం రూ.232 కోట్లు కేటాయించిందని, తద్వారా 7,091 మందికి లబ్ధి చేకూరిందని రఘురామశర్మ పేర్కొన్నారు.