సూర్యాపేట : తెలంగాణ ప్రభుత్వం సర్వమత సంప్రదాయాలకు, ఆచారాలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా సూర్యాపేట(Suryapeta) జిల్లా కేంద్రం ఈద్గా(Idga)లో జరిగిన ప్రార్థనలో మంత్రి పాల్గొని ముస్లింల(Musilms) కు రంజాన్ శుభాకాంక్షలు (Ramzan Greetings) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణా ప్రతీక అని అన్నారు.
రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని అన్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలను అధికారికంగా నిర్వహించేది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాలకు ఎంతగానో దోహద పడుతున్నాయని తెలిపారు.
రంజాన్ మాసంలో నెల రోజులుగా కఠోరమైన దీక్ష చేపట్టి ఉపవాసాన్ని విడిచి భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకుంటున్నారని తెలిపారు. నెలరోజుల్లో యావత్ సమాజం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ముస్లింలు కోరుకున్నారని వెల్లడించారు.