నిజామాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గురుకుల పోస్టులకు ఎంపికైన వారిని హైదరాబాద్కు తరలించాలని కలెక్టర్లకు ప్రభుత్వం హుకుం జారీ చేసింది. టీ, టిఫిన్లు ఏర్పాటుచేసి ప్రత్యేక బస్సుల్లో వారిని రాజధానికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. 12 గంటల కల్లా తరలిరావాలని ఆర్సీవోలు, ప్రిన్సి పాళ్లకూ ఆదేశాలు జారీ చేశారు. 100 కిలోమీటర్ల పరిధిలోని గురుకులాల సిబ్బంది ఆధార్, ఎంప్లాయ్ ఐడీ కార్డుతో 2 గంటలకల్లా రావాలనీ సర్క్యులర్ జారీ అయింది.
దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ గురుకులాలకు చెందిన వారంతా త లలు పట్టుకుంటున్నారు. ఓ వైపు పరీక్షల సమయం ముంచుకొస్తున్న కీలక స మయంలో ఇలాంటి ఆదేశాలేంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నర్సింగ్ స్టాఫ్, పోలీస్ నియామకాలను తమ గొప్పతనంగా ప్ర చారం చేసుకున్నది. నేడు గురుకుల అభ్యర్థుల విషయంలోనూ ప్రచారానికి ఎగబడుతున్నది. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే, నిరుద్యోగుల నుంచి ఒక్కటంటే ఒక్క దరఖాస్తును స్వీకరించకుండానే 27 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్టుగా కాంగ్రెస్ చెప్పుకుంటుండటం గమనార్హం.