మెదక్ : స్వరాష్ట్రంలో పండుగలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన హవేళీఘనపూర్లో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గత పాలకుల హయాంలో అన్ని రంగాల్లో తెలంగాణ వివక్షకు గురైందన్నారు.
తెలంగాణ పండులను టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల వారికి కానుకలు అందజేస్తూ అందరు ఆనందంగా పండుగ జరుపుకునేందుకు ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. మహిళలు ఇష్టపడే బతుకమ్మ పండుగకు సీఎం కేసీఆర్ సొంత అన్నలా చీరెలు అందజేస్తూ వారి మన్ననలు పొందుతున్నారని తెలిపారు.
కాకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మెదక్ పీఎసీఎస్ చైర్మన్ హన్మంత్రెడ్డి, ఎంపీడీవో శ్రీరామ్, డిప్యూటీ తహల్దార్ నవీన్, ఐకేపీ ఏపీఎం భాస్కర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మేకల సాయిలు, సర్పంచ్లు శ్రీహరి, యామిరెడ్డి, ఎంపీటీసీలు రాజయ్య, మంగ్యా, మెదక్ సొసైటీ డైరెక్టర్ సాప సాయిలు, తదితరులు పాల్గొన్నారు.