సన్మానసభలో టీఎన్జీవో నేతల ప్రశంసలు
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కుతుందని టీఎన్జీవో నేతలు కొనియాడారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అఖిల భారత రాష్ట్రస్థాయి ఉద్యోగుల ఫెడరేషన్ (ఏఐఎస్జీఈఎఫ్) వైస్ చైర్మన్గా, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా నియమితులైన సందర్భంగా వారిద్దరినీ హైదరాబాద్ జిల్లా టీఎన్జీవో యూనియన్ అధ్వర్యంలో శనివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను రాయితీని పెంచాలన్న డిమాండ్ పరిశీలనలో ఉందని చెప్పారు. టీఎన్జీవో రాష్ట్ర కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేని, శ్రవణ్, కొండల్రెడ్డి, శైలజ, విక్రమ్, కేఆర్ రాజ్కుమార్, బాలరాజు, ఒమర్ఖాన్, మురళిరాజ్, నరేశ్కుమార్, కురాడి శ్రీనివాస్, ఖాలీద్ అహ్మద్, వైదిక్ శస్త్ర, శంకర్, సుజాత, గీతాసింగ్, ముఖీం ఖురేషీ, సయ్యద్ కుత్బుద్దీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.