సంగారెడ్డి : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్యరావు అన్నారు. సోమవారం జహీరాబాద్ మండలం మల్చల్మ గ్రామంలోని ఈరన్న చెరువులో చేప పిల్లని వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కులవృత్తులకు పూర్వ వైభవం కల్పించేoదుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతుందన్నారు. దీనిని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గర్భశోకం మిగిల్చిన రోజే.. కవలలకు జన్మ
CM Jagan |సీఎంగా నన్ను దించడానికి ప్రయత్నిస్తున్నారు..
మత్స్యరంగానికి ఊపిరి పోసిన సీఎం కేసీఆర్ : మంత్రి తలసాని