సిద్దిపేట,డిసెంబర్13 : ప్రజల అభిప్రాయాల మేరకే ప్రభుత్వ విధానాలు(Government decisions) ఉంటాయని రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట(Siddipet) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో మార్నింగ్ వాక్ చేసి ప్రజలతో మాట్లాడారు. అనంతరం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ.. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విధానాలు ప్రజల అభిప్రాయం మేరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా నేరుగా తెలియజేయాలని సూచించారు. సంవత్సరంలోపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ..రాజాసింగ్ ఏమైనా జ్యోతిష్యం తెలుసా అని ప్రశ్నించారు.