హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని, అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ కాలేజీ కాంట్రా క్ట్ అధ్యాపకుల సంఘం కోరింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో సంఘం నేతలు మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డిలను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.
కాంట్రాక్ట్ లెక్చరర్లను ఏప్రిల్ 1 నుంచి క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులను కలిసిన వారిలో సంఘం నేతలు మైలారం జంగయ్య, రామకృష్ట గౌడ్, జీ రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేశ్, శ్రీనివాస్రెడ్డి, మనోహర్, సంగీత తదితరులు ఉన్నారు.