హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మెప్పు పొందేందుకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. అద్దంకి దయాకర్.. అబద్ధాల దయాకర్ అని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై గోసుల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా అద్దంకి దయాకర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని గోసుల విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుల గురించి మాట్లాడేటప్పుడు తన స్థాయిని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.