మహబూబాబాద్: జిల్లాలోని డోర్నకల్ వద్ద గూడ్సు రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న గూడ్సు రైలు డోర్నకల్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైలులోని రెండు వ్యాగన్లు పట్టాలపైనుంచి పక్కకు జరిగాయి. దీంతో సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ వ్యాగన్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.