హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్లో రూ.4,621 కోట్ల జీఎస్టీ వసూలైనట్టు వాణిజ్య పన్నుల కమిషనర్ శుక్రవారం ప్రకటించారు. నిరుడు ఏప్రిల్లో రూ.3,433 కోట్లు వసూలయ్యాయని, ఈ ఏడాది అదనంగా రూ.1,188 కోట్ల రాబడి వచ్చిందని వెల్లడించారు.
జీఎస్టీతోపాటు పెట్రోల్, మద్యంపై వ్యాట్, వృత్తి పన్నుల ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.7,570 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపారు.