మంత్రి హరీశ్రావు
సిద్దిపేట కలెక్టరేట్, జూన్16: తెలంగాణ వచ్చాక కొత్త జిల్లాల ఏ ర్పాటుతో పాలన ప్రజలకు చేరువైందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో నూతన సమీకృత కలెక్టరేట్, పోలీస్కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలను బుధవారం సందర్శించి.. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 20న సీఎం కేసీఆర్ చేతులమీదుగా సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, క్యాంపు కార్యాలయ ప్రారంభించుకోనున్నట్టు చెప్పారు.