ఖమ్మం, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ విజన్తో సాగుకు తెలంగాణ స్వర్ణయుగంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండా లో రూ.15 కోట్ల నిధులతో 20 వేల టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాములను శుక్రవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో రాష్ర్టాల్లో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతుండగా, తెలంగాణలో మాత్రం సాగు ఉత్పత్తులు ఏటా పెరుగుతున్నాయని చెప్పారు. ఇందుకు అనుగుణంగా గోదాము లు నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో ధాన్యం దిగుబడి 62 లక్షల టన్నులు ఉండగా గతేడాది 3 కోట్ల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ప్రస్తుతం 1.46 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని తెలిపారు.
విత్తన భాండాగారంగా తెలంగాణ
సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం దేశానికే విత్తన భాండాగారంగా అవతరించిందని మంత్రి పువ్వా డ అజయ్కుమార్ అన్నారు. రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ అమలు చేస్తున్నారని చెప్పారు. నీటిని ఒడిసిపట్టే పనులకు తెలంగాణ సర్కార్ ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వేద సాయిచంద్, జడ్పీ చైర్మన్ కమల్రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.