మహబూబాబాద్ : బీఆర్ఎస్లో పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తొర్రూరు మండలంలోని 65 మంది స్వర్ణ కారులు బీఆర్ఎస్ నాయకుడు రామ సహాయం కృష్ణ కిశోర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హనుమకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీలో వారికి సముచిత గౌరవం కల్పిస్తామన్నారు. వారి శ్రేయోభిలాషిగా, ఆ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పార్టీలో చేరిన వారిలో..తొర్రూరు మండల స్వర్ణకారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు ఎం.నాగేష్, టి. వెంకన్న, పి. భిక్షపతితోపాటు సభ్యులు చిట్టిమల్ల కిష్టయ్య, పానుగంటి శ్రీనివాస్, ఇటికాల శ్యాంసుందర్, ఇటికాల రాధాకృష్ణ, దాసరోజు రమేష్, దుర్సోజు ఆచారి, దురుసోజు నాగేశ్వరరావు, ప్రసాల భాస్కరాచారి, మోత్కూరి రాజేంద్ర చారి, దాస రోజు జగదీశ్వర చారి, ఇటికాల వేణు, మారోజు శుభాష్, భువనాల నవనీత్, తదితరులు ఉన్నారు. తాము పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు.
పెద్ద వంగర మండలం అవుతాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హనుమకొండలో జరిగిన ఒక కార్యక్రమంలో వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో పనికర బిక్షం, తోటకూరి బాలకృష్ణ, కత్తుల మహేష్, గద్ద లింగయ్య, రాసాల బిక్షం, గద్ద ఎల్లయ్య, పనికర కొమురయ్య, బందే పెళ్లి ఉప్పలయ్య, బొమ్మర బోయిన వీరమల్లు, గద్ద జంపులు, రాసాల యాకయ్య, కోట రవి తదితరులు ఉన్నారు.
అలాగే పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్, పెద్ద వంగర మండలం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ ఆధ్వర్యంలో పెద్ద వంగరకు చెందిన కాంగ్రెస్ మైనారిటీ నాయకులు ఎస్కే ఫరీద్, ఎస్కే జాఫర మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.