రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పెళ్లింటి వారందరూ ఫంక్షన్ హాల్లో ఉండగా.. పెళ్లి కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న రూ. 15 లక్షల నగదు, 4 తులాల బంగారం ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. బీరువాలోని వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు.
పెళ్లి అయిపోయాక ఇంటికి వచ్చిన వధువు, ఆమె కుటుంబ సభ్యులు దొంగతనం జరిగిందని తెలిసి షాకయ్యారు. తక్షణమే పెళ్లి కుమార్తెతో పాటు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ అనిల్ కుమార్ పోలీసులతో కలిసి చోరీ జరిగిన ఇంటికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.