దుబాయ్ స్మగ్లర్ వద్ద 381 గ్రాములు పట్టివేత
శంషాబాద్, ఏప్రిల్ 14: సూట్కేసు లోపలి ఫ్రేంలో రూ.13.1 లక్షల విలువైన 381 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణాచేస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతని సూట్కేసును పరిశీలించగా, బంగారం ఫ్రేం లభించింది. బంగారాన్ని స్వాధీనంచేసుకున్న అధికారులు, నిందితుడిని విచారిస్తున్నారు.