Gold Seized | శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ ఇద్దరు వ్యక్తులు పెద్ద ఎత్తున బంగారం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్కు చేరిన ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు అతన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలలో ప్లాస్టిక్ బాక్స్తో పాటు పిల్లల పాల మిక్స్లాంటిది కనిపించింది. దాన్ని పరిశీలించగా పౌడర్ రూపంలో ఉన్న బంగారంగా తేలింది. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా బంగారాన్ని పౌడర్గా చేసి తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.
సదరు వ్యక్తి నుంచి 27 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.2.77లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో మరొకరి నుంచి 726 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.45.37లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని కస్టమ్స్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడుతున్నారు. చెప్పులు, బూట్లు, సాక్సుల్లో, బ్యాగులు తదితర వస్తువుల్లో బంగారాన్ని దాచి పెట్టి తరలించేందుకు యత్నిస్తున్న సమయంలో కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా తనిఖీ చేసి బంగారాన్ని పట్టుకున్న విషయం తెలిసిందే.