హైదరాబాద్ : శంషాబాద్లో రాజీవ్ అంతర్జాతీయ గాంధీ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి అధికారులు 723.39 గ్రాముల బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ దాదాపు రూ.38లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.