హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి 6ఈ-1405 విమానంలో వచ్చిన వ్యక్తి నుంచి లక్ష సౌదీ రియాల్స్ను స్వాధీనం చేసుకున్నారు. భారతీయ కరెన్సీ విలువలో రూ.21.70లక్షలు ఉంటాయని అధికారులు చెప్పారు. సీఎస్ఎఫ్ఐ సిబ్బంది సహాయంతో అంతర్జాతీయ టెర్మినల్ వద్ద సదరు వ్యక్తిని పట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.
అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. జే9-403 విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఈజిస్ట్ జాతీయుడి నుంచి 500 గ్రాముల 24 క్యారెట్స్ బంగారు గొలుసు, 302 గ్రాముల ఆరు బంగారు గాజులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం బంగారం 802 గ్రాములు పట్టుకున్నామని, బంగారం విలువ రూ.41,86,440 విలువ ఉంటుందని అధికారులు వివరించారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.