Godrej Agrovet | గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది. కంపెనీ ఇప్పటికే తెలంగాణలో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నది. వంట నూనెలు, డెయిరీ, ఆగ్రో, వెటర్నరీ సర్వీసెస్, ఆగ్రో కెమికల్స్, పశువుల దాణా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ను కంపెనీ నెలకొల్పుతున్నది. సెక్రెటేరియట్లో మంగళశారం గోద్రెజ్ ఆగ్రో వెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగ్ యాదవ్తో పాటు కంపెనీ ప్రతినిధులు సీఎంతో చర్చలు జరిపారు.
తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నీచర్, కన్సూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని సీఎం కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ పామ్, డెయిరీ బిజినెస్ను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ను ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు. సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.