వరద కాలువకు అనుబంధంగా యాసంగిలో పంటలను కాపాడేందుకు గోదావరి జలాలు తరలుతున్నాయి. కాళేశ్వరం లింక్లో-2లోని ఎల్లంపల్లి బరాజ్ నుంచి నీటిని నంది, గాయత్రీ పంప్హౌస్ల ద్వారా ఎత్తిపోత ప్రారంభమైంది. గురువారం నుంచి నందిమేడారంలోని నంది పంప్హౌస్లో 2,3వ మోటర్లను ఆన్ చేసి, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్కు వదిలారు.
అక్కడి రెండు బాహుబలి మోటర్ల ద్వారా కాళేశ్వర జలాలను వరద కాలువ 99వ కిలోమీటర్ పాయింట్కు మళ్లించారు. బోయినపల్లి సమీపంలోని రెగ్యులేటర్లను మూసివేయగా, నీళ్లు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో నిర్మించిన రాంపూర్ పంపుహౌస్కు ఎదురెక్కుతున్నాయి.