హైదరాబాద్, డిసెంబర్8 (నమస్తే తెలంగాణ): గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం ఈనెల 15న నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు జీఆర్ఎంబీ లేఖలు రాసింది. ఇప్పటికే ఇరు రాష్ర్టాలకు సమావేశ ఎజెండాను కూడా జీఆర్ఎంబీ అందజేసింది. సమావేశంలో బోర్డు వార్షిక బడ్జెట్, రూ.200 కోట్ల చొప్పున చెల్లించాల్సిన సీడ్ మనీ తదితర అంశాలను చర్చించనున్నారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివనందన్కుమార్కు పూర్తి అదనపు బాధ్యతలను కేంద్ర జల్శక్తిశాఖ అప్పగించింది. పీపీఏ సీఈవోగా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ ఇటీవలనే సీడబ్ల్యూసీ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఛండీగఢ్లో విధులు నిర్వర్తిస్తున్న శివనందన్కుమార్ పీపీఏ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) జనరల్ బాడీ సమావేశం ఈ నెల 13న ఢిల్లీలో నిర్వహించనున్నారు. సమావేశానికి రాష్ర్టాల సీఎంలు సభ్యులుగా వ్యవహరించనున్నారు.ఎన్డబ్ల్యూడీఏ వార్షిక నివేదిక, బడ్జెట్ ఆమోదంతోపాటు గోదావరి, కావేరి అనుసంధానంపై చర్చించనున్నారు.