జగిత్యాల : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. జిల్లాలోని ధర్మపురి పట్టణం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. దీంతో గోదావరి పరివాక ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
పట్టణంలోని ముంపు ప్రాంతాల్లోని ప్రజలను జగిత్యాల డిస్ట్రిక్ట్ గార్డ్ పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితులకు ధర్మపురిలోని ప్రభుత్వ కళాశాలలో తాత్కాలిక పునరావాసం ఏర్పాట్లు చేశారు.
కాగా, పరిస్థితి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వయంగా పర్యవేక్షించారు. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. నిర్వాసితులకు అన్ని విధాల ఆదుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు.