నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 2: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్కు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి నిరసనల సెగ తగులుతున్నది. గత కొద్దిరోజులుగా ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించి మరీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై సామాన్యులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. శనివారం సైతం వేర్వేరు ప్రాంతాల్లో వినూత్నంగా నిరసన తెలిపారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వేస్టేషన్లో మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ తరహా వేషధారణలో ఓ వ్యక్తి ప్రదర్శించిన ‘మేము బ్యాంకులను మాత్రమే దోచుకొంటం..మీరు దేశాన్ని దోచుకొంటున్నారు’ అని రాసి ఉన్న ప్లకార్డు సోషల్మీడియాలో వైరల్గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో, మధిరలో ‘బైబై మోదీ’ అనే నినాదంతో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ‘
తెలంగాణలో నిరసనల నేపథ్యంలో కర్ణాటకలోని కలబురగి, బీదర్ జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు జహీరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం గమనార్హం. మోదీ బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు కర్ణాటకలోని కలబురగి ఎంపీ ఉమేశ్జాదవ్ గిరిజన తండాల్లో ప్రచారం చేశారు. జహీరాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంపీ వెంట ప్రచారం చేసిన ఫొటో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.