Telangana | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : పిల్లలు ఏడుస్తున్నారనో, అడిగింది ఇవ్వలేదని మారాం చేస్తున్నారనో.. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను బాధ్యులను చేసి, జైలుకు పంపిస్తామని ఎక్స్ వేదికగా పోలీసుశాఖ పోస్టు చేసింది. ‘పిల్లల సరదా కోసం మైనర్లకు వాహనాలు ఇస్తున్నారా..? మీరు చేసే పని మీతోపాటు ఇతరులను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుంది. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే.. ఆ తల్లిదండ్రులదే బాధ్యత. వారు కూడా జైలుకు వెళ్లక తప్పదు’ అంటూ తెలంగాణ పోలీసు శాఖ తల్లిదండ్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.