హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్కు మద్దతు ధర ఇవ్వాలని, క్వింటాలుకు రూ.18 వేలు నిర్ణయించాలని కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ (సీఏసీపీ)ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. దీంతో పాటు పసుపు, మిర్చికీ మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం గోల్కొండ హోటల్లో నిర్వహించిన దక్షిణ రాష్ర్టాల సీఏసీపీ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు.
రైతులకు సాగు ఖర్చులకు తగ్గట్టుగా మద్దతు ధర రావడం లేదని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా మద్దతు నిర్ణయించాలని కోరారు. సీఏసీపీ చైర్మన్ విజయ్పాల్ శర్మ మాట్లాడుతూ.. వైవిధ్యమైన పంటల సరళి లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో మారెట్ డిమాండ్కు అనుగుణమైన అపరాలు, నూనెగింజల పంటలను పండించాలని సూచించారు.