హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) బరాజ్కు అనుమతులు ఇవ్వాలని కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీ) తెలంగాణ సర్కారు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తాజాగా మరోసారి లేఖను రాసింది. సమ్మక్కసాగర్ ప్రాజెక్టు డీపీఆర్ను సీడబ్ల్యూసీకి తెలంగాణ అందజేసింది. ప్రాజెక్టు వల్ల ముంపు లేదని ఛత్తీస్గఢ్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకురావాలని తెలంగాణకు సీడబ్ల్యూసీ సూచించింది. దాని కోసం తెలంగాణ సర్కారు మూడునెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రాజెక్టుపై ఒప్పందానికి ముందుకు రావాలని కోరుతూ ఛత్తీస్గఢ్ అధికారులకు పలుమార్లు లేఖలు రాసింది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రం నుంచి ఎలాంటి స్పందన రాని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీకి తెలంగాణ సర్కారు ఇటీవల మారోమారు లేఖ రాసింది. టీఏసీ క్లియరెన్స్లోగా ఛత్తీస్గఢ్ నుంచి ఎన్వోసీ తీసుకుంటామని, ప్రస్తుతానికి ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.