హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వాణిజ్య ప్రాంతాల్లో చెత్త ఎక్కువగా పోగయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ప్రతి 50 మీటర్లకో చెత్తడబ్బాను ఏర్పాటు చేయాలని శుక్రవారం సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ ఆ దేశాలు జారీచేశారు. వాణిజ్య ప్రాంతాల్లో 60 అడుగుల రోడ్డులో ప్రతి 500 మీటర్లకు ఒకరిని రోజుకు రెండుసార్లు ఊడ్చటానికి, వ్యర్థాలను సేకరించడానికి అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. త్వరగా చెత్తను సేకరించేందుకు వాహనం వెంబడి ఇద్దరు వ్యక్తులు ఉండాలని, దాని ద్వారా త్వరగా చెత్త సేకరించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాణిజ్య ప్రాం తాల్లో ప్రమాదకర పదార్థాల కోసం ఎర్ర డబ్బాను అందజేయాలని సూచించారు.