హైదరాబాద్: పారిశుధ్యం విషయంలో జీహెచ్ఎంసీ పనితీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటి వద్దే చెత్త తొలగించడం లేదని, ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో తూతూమంత్రంగా పనిచేసుకుపోతున్నారని విమర్శిస్తున్నారు. జీహెచ్ఎంసీ వాళ్లు తన ఇంటి వద్దే చెత్తను తొలగించడం లేదని ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) అన్నారు. చెత్త పేరుకుపోయిందని ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా కొంత తీసి మిగతాదంతా అలానే ఉంచేసి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పనితీరు ఏమాంత్రం బాగాలేదని చెప్పారు. చేసే పని పకడ్బందీగా, మంచిగా చేయడాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అధికారులకు సూచించారు.
జీహెచ్ఎంసీ వాళ్ళు నా ఇంటి వద్దే చెత్తను తొలగించడం లేదు – కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్
నా ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోయిందని ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా కొంత చెత్త తీసి మిగతాదంతా అలానే ఉంచేసి వెళ్లారు..
పారిశుద్ధం విషయంలో జీహెచ్ఎంసీ పనితీరు బాగాలేదని అసంతృప్తి వ్యక్తం… pic.twitter.com/KwphcuQFpR
— Telugu Scribe (@TeluguScribe) October 24, 2024
గ్రేటర్ హైదరాబాద్లో చెత్త సమస్య జటిలంగా మారింది. గార్భే జ్ ఫ్రీ సిటీయే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. దీంతో కాలనీలు, బస్తీలు కంపుకొడుతున్నాయి. డెంగీ, మలేరియా ఇతర రోగాలతో ప్రజలు సతమతమవుతున్నా.. అధికారులు పారిశుధ్య నిర్వహణపై క్షేత్రస్థాయి తనిఖీలు జరపడంలేదు. పారిశుధ్య నిర్వహణలో లోపాలను సరిదిద్ది ‘స్వచ్ఛ హైదరాబాద్’కు మెరుగైన ర్యాంకింగ్ లక్ష్యంగా కృషి చేయాల్సిన అధికారులు.. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా..
స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా.. డస్ట్ బిన్ ఫ్రీ సిటీగా మార్చాలని గత ప్ర భుత్వం నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్ల వెం బడి చెత్త డబ్బాలను దాదాపు 800 చోట్లకుపైగా తగ్గించే కార్యక్రమాలను అమలు చేసింది. పెరిగిన జనాభా, కాలనీల్లో చెత్త ఉత్పత్తి పెరుగడంతో అందుకు అనుగుణంగా తరలించే స్వచ్ఛ ఆటోలు, వాహనాలను పెంచుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి చెత్తను ఆటోల్లో ట్రాన్స్ఫర్ స్టేషన్కు, అటు నుంచి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే రోడ్లపై చెత్త ఉన్నా అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో రహదారులపై వ్యర్థాల సమస్య తీవ్రరూపం దాల్చుతున్నది.
నీరుగారుతున్న స్వచ్ఛ లక్ష్యం
గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతున్నది. ‘స్వ చ్ఛ సర్వేక్షణ్-2024’లో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుపుతామన్న లక్ష్యం నీరుగారుతున్నది. గడిచిన కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా..రోడ్లపై పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్భేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) జీహెచ్ఎంసీ పరిధిలో 2640 ప్రాంతాలను గుర్తించి.. వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో వీటికి అదనం గా కొత్తగా జీవీపీ పాయింట్లు పుట్టుకొస్తున్నాయి. స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే పారిశుధ్యంపై ఫిర్యాదులు అధి కం కావడం, ఇటీవల హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొ న్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వ యంగా మేయర్ విజయలక్ష్మి పారిశుధ్య నిర్వహణ ఏ మాత్రం బాగలేదని, తన డివిజన్లోనూ చెత్త ఎత్తడం లే దని సంబంధిత అధికారులపై మండిపడడం గమనార్హం.