సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మండే
చౌటుప్పల్ రూరల్, జూలై 31: కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉన్నదని సీఎస్ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మండే అన్నారు. యాదాద్రి భువనగరి జిల్లా చౌటుప్పల్ మండలం మందోల్లగూడెంలోని సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో నెలకొల్పిన భూ అయస్కాంత క్షేత్ర పరిశోధన కేంద్రంలో నూతన జీయో మాగ్నెటెక్ అబ్జర్వేటరీని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెకండ్వేవ్లో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని థర్డ్వేవ్ను అత్యంత సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సి న్ వేయించుకోవాలని సూచించారు. విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. ఇప్పటికే 60-65శాతం మంది వారికి తెలియకుండానే వైరస్ బారిన పడి కోలుకున్నారన్నారు. వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతుండటంతో థర్ట్వేవ్పై భయపడాల్సిన పనిలేదన్నారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.