హైదరాబాద్, ఫిబ్రవరి 25 : పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ సెంట ర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, విమానాశ్రయం, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటలవరకు చుక్కలు వేయనున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో మాత్రం రాత్రి 8 గంటల వరకు చుక్కలు వేయనున్నారు. ఆ తర్వాత రెండు రోజులపాటు సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి, చుక్కలు వేసుకోని వారిని గుర్తించి వేస్తారు. రాష్ట్రంలో 38 లక్షల మందికిపైగా పిల్లలకు చుకలు వేయాలని వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ కార్యక్రమంలో ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని వియజవంతం చేయాలని మంత్రి హరీశ్రావు కోరారు. ఎమ్మెల్యేలు ఏదో ఒక కేంద్రానికి వెళ్లి చుక్కల పంపిణీని ప్రారంభించాలని సూచించారు.