జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): లంచం తీసుకుంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా మల్లంపల్లి శ్రీనగర్కు చెందిన గుగులోత్ లచ్చిరాం ఏడాది క్రితం పరిశ్రమల శాఖ ద్వారా రూ.53 లక్షలతో అశోక్ లేల్యాండ్ వాహనం తీసుకున్నాడు. సబ్సిడీ కోసం పరిశ్రమల శాఖ కార్యాలయ జనరల్ మేనేజర్కు దరఖాస్తు చేసుకున్నారు.
ఆ శాఖ డీఎం రూ.50 వేలు లంచం డిమాండ్ చేయగా, సదరు మొత్తాన్ని అందజేశారు. అనంతరం మరో రూ.60 వేలు కావాలని డిమాండ్ చేశాడు. భూపాలపల్లిలోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, ములుగు ఇన్చార్జి గంగాధర శ్రీనివాస్ గురువారం లచ్చిరాం నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీనివాస్ను హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.